హైదరాబాద్ : ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతుల్ని వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిష్ణు కీర్తన్ అనే యువకుడు అమ్మాయి పేరుతో ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్టులు పంపుతున్నాడు.
Also Read.. సఫారీలకు పట్టపగలే చుక్కలు చూపించిన సిరాజ్.. 55 పరుగులకే ఆలౌట్
అమ్మాయే అనుకొని నమ్మి పరిచయం పెరిగాక.. మహిళల వ్యక్తిగత ఫొటోలను అడిగేవాడు. అనంతరం వాటిని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ చేసేవాడు. దీంతో కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.