Friday, May 3, 2024

ఏపీ ప్రజలకు చల్లని కబురు

spot_img

ఏపీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కొన్ని నెలలుగా తీవ్ర ఉష్ణోగ్రత, వడగాల్పులతో తల్లడిల్లిన రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది.

ప్రస్తుతం రుతుపవనాలు శ్రీహరికోట, సమీప ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని , రాగల 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని, పలుచోట్ల జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Latest News

More Articles