న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నెల 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి.. తెలంగాణ వాసుల విడుదల కోసం దుబాయ్ లో కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు
అయితే, సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలోనే ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈనెల 19న వినాయక చతుర్థి నాడు కొత్త పార్లమెంట్ భవనంలోకి సమావేశాలను మార్చాలని మోదీ సర్కార్ భావిస్తున్నది.