లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు శంకరమ్మ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకరమ్మ. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మహిళా బిల్లు అమలు కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటాల ఫలితమే నేడు మహిళా బిల్లు ఆమోదం పొందిందని అన్నారు శంకరమ్మ. మహిళలు రాజాకీయంగా రాణించేందుకు 33 శాతం రిజర్వేషన్లు ఎంతో దోహదపడతాయన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజాకీయంగా ఎదిగి సమానత్వం సాదించాలన్నారు కాసోజు శంకరమ్మ.