Tuesday, May 14, 2024

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

spot_img

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. రాత్రి 7.45 నుండి 8.45 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నారు.

Also Read.. ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదు

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారు. రాత్రి 9 నుండి 11 గంటల వరకు భక్తులకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి దర్శనమిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు.

Latest News

More Articles