తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ప్రభుత్వం కీలన ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలు కోసం వచ్చే ప్రతిపాదనలను ఈ కమిటీ పరిశీలించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సీఎస్ శాంతి కుమారి ఛైర్మన్ గా ఉండనున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం