Saturday, May 11, 2024

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం

spot_img

కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికల నగారా నిన్ననే మోగిందని… మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధవులతో జరురుకోవటం సంతోంగా ఉందన్నారు.

నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారన్నారు. కానీ కేసీఆర్ ఆనాడే ఉద్యమ సమయంలో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అయితే గౌడ కులస్తులకు అండగా ఉంటామన్నారు.

అలాంటి కులవృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గీత కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం పాలసీగా తీసుకొని ఈత వనాలని పెంచుతోందన్నారు. మద్యం టెండర్లలో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాల కాలంలో నిజామాబాద్ నుంచి ఎంతో మంది పెద్ద నాయకులు పనిచేశారని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. జిల్లాకు ఒకటే బీసీ హాస్టల్ ఉండేదన్నారు. అలాంటిది ఈరోజు 15 బీసీ హాస్టల్స్ ను ఏర్పాటు చేసుకున్నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీజు రింయంబర్స్ మెంట్ ఇస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత.

తెలంగాణలోఉన్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలప్పుడు అనేక పార్టీలు వస్తాయి… వారిని నిలదీయాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీగా పని చేశాం కాబట్టి హక్కుగా ప్రజల దగ్గరకు వస్తున్నాం. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ ఏర్పడేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: పొంగులేటికి భారీ షాక్.. ఔకాత్ కి మించి ఎగిరితే గింతే

Latest News

More Articles