Sunday, May 19, 2024

కామారెడ్డిలో దారుణం.. వృద్ధురాలిని పీక్కుతిన్న వీధికుక్కలు..!

spot_img

కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న ఓ వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేశాయి. రోడ్డుపైకి వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి మరీ చంపేశాయి. మాచారెడ్డి మండలం లచ్చపేటలో ఈరోజు ఉదయం ఇంట ముందు కూర్చుున్న రామవ్వపై వీధికుక్కలు దాడి చేశాయి. వృద్ధురాలిని చుట్టిముట్టి రోడ్డుపై కి ఈడ్చుకెళ్లాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీధికుక్కలను వెళ్లగొట్టారు. తీవ్రంగా గాయపడిన రామవ్వను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ రామవ్వ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: రేవంత్ సర్కార్ పైశాచికత్వం..బడి పిల్లలకు స్నాక్స్ బంద్..!!

Latest News

More Articles