Friday, May 3, 2024

బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..సుంకే రవిశంకర్ డిమాండ్

spot_img

కరీంనగర్ జిల్లా: మరోసారి ఎంపీ టికెట్ కోసమే బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వందల కోట్లు సంపాదించుకున్న బండి సంజయ్ కు మరోసారి అదిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేతలే డిమాండ్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ అన్నారు. ఎంపీగా నయాపైసా అభివృద్ది చేయని బండి సంజయ్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తే ప్రజలే తన్ని తరిమేస్తారని చెప్పారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బీజేపీ నేతల పాస్ పోర్టులే ముందు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

లక్షల కోట్ల ప్రజధనాన్ని దోచుకొని పారిపోయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యాల పాస్ పోర్టులు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఅర్ పై విమర్శలు చేస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఅర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest News

More Articles