Sunday, May 19, 2024

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో 350 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ స్పన్  గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న  సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం 350 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 1000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా చందన్వల్లిలో సింటెక్స్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నది. ఈ తయారీ కేంద్రం నుంచి సింటెక్స్ వాటర్ ట్యాంకులను, ప్లాస్టిక్ పైపులను, ఆటో కాంపోనెంట్స్ మరియు ఇతర పరికరాలను తయారు చేయబోతున్నది. ఈ కంపెనీ తయారీ ప్లాంట్ శంఖుస్థాపన కార్యక్రమం ఈ నెల 28 తేదిన జరగనున్నది. వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బికె గోయెంకా, మంత్రి కె.తారక రామారావు ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు.

Also Read.. ముగిసిన హీరో నవదీప్ విచారణ

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వెల్ స్పన్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో మరింత విస్తరించనున్నడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వెల్ స్పన్ గ్రూప్ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో అదనంగా 350 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన మౌలిక వసతుల వలన అనేక నూతన పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని, అయితే ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కార్యకలాపాలను, తమ పెట్టుబడులను విస్తరించడాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా తెలుసుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలను, మౌలిక వసతుల కల్పన సకాలంలో అందించడం వలన ఆయా కంపెనీలు భారీగా విస్తరిస్తున్నాయన్నారు. సింటెక్స్ కంపెనీ పెట్టుబడిని అహ్వానించిన మంత్రి కెటిఅర్, కంపెనీకి అన్ని రకాల సహాయసహకాలు అందిస్తామని తెలిపారు.

Also Read.. బాలీవుడ్ బ్యూటీతో ఎంపీ రాఘవ్ పెళ్లి.. ప్యాలెస్‌లో హైసెక్యూరిటీ

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తమ వెల్ స్పన్ గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని,  ఇక్కడి వాతావరణం పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉందని, అందుకే తమ అద్వర్యంలోని సింటెక్స్ ద్వారా మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని తెలిపింది.

Latest News

More Articles