డ్రగ్స్ కేసులో నవదీప్ పై జరిగిన విచారణపై యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించాము. నవదీప్ ను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. డ్రగ్స్ కేసులో నవదీప్ కు ఉన్న 81 లింక్స్ ను గుర్తించాము. అందులో 41 లింక్స్ పై వివరాలు ఇచ్చాడు. సిట్,ఈడి విచారణ ముందు డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు నవదీప్ ఒప్పుకున్నాడు.
ఇప్పుడు తాను ఎలాంటి డ్రగ్స్ వాడడం లేదని చెప్తున్నాడు. తన స్నేహితుడు రామ్ చంద్ తో కలిసి గతంలో పబ్ BPM నిర్వహించినట్టు నవదీప్ చెప్పాడు. నవదీప్ ఫోన్లో ఉన్న డాటా మొత్తం డిలీట్ చేశాడు. నవదీప్ ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తాం. డేటా అంత స్వాధీనం చేసుకున్నాక మళ్లీ నవదీప్ ని పిలిచి విచారిస్తాం’ అని చెప్పారు ఎస్పీ సునీతా రెడ్డి.