అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పడం కలకలం సృష్టించింది. విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఏటీసీతో సమన్వయ లోపం కారణంగానే సమస్య తలెత్తిందని సంబంధిత అధికారులు తెలిపారు.
Also Read.. ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన
వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు విశాఖ నుంచి అరకు వెళుతున్నారు. అయితే, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారితప్పి వేరే రూట్లో వెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏటీసీ వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేసింది. ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ మళ్లీ సరైన మార్గంలో వెళ్లింది. అనంతరం చంద్రబాబు సురక్షితంగా అరకు చేరుకున్నారు.