మేడ్చల్: మేడ్చల్ ప్రజల రుణం తీర్చుకోనిలేదని, మేడ్చల్ను మరింత అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపించారని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని అన్నారు.