ఖమ్మం జిల్లా: ప్రతిపక్షంలో ఉన్నా , పాలక పక్షంలో ఉన్నా కేసీఆర్ ది ఎప్పుడు ప్రజల బాటేనని ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సంక్షేమం, సుపరిపాలనను కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి కాంగ్రెస్ చిత్తశుద్ది ని నిరూపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పక్షాన పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అతి స్వల్ప ఓట్ల తేడాతో అధికారం కోల్పోవడం బాధగా ఉందన్నారు.