తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ సరళి ప్రశాంతంగానే ముగిసింది. మావోయిస్టు ప్రబావితమున్న ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్ ముగియగా.. మిగితా 106 నియోజకవర్గాల్లో 5గంటలకు కంప్లీట్ అయింది. ప్రస్తుతం క్యూ లైన్లో ఉన్నవారికే అవకాశం ఇస్తున్నారు.
వరంగల్, నల్గొండ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ రద్దీ సాయంత్రం ఒక్కసారిగా ఓటర్లు తరలిరావటంతో భారీ క్యూ లైన్లు ఉన్నాయి. మధ్యాహ్నం మూడింటి వరకు 52శాతంగా పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.