Monday, May 13, 2024

ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ

spot_img

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సోహెల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహారాల ఇంఛార్జి ఖర్గే కు నా రాజీనామా లెటర్ పంపినట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 34 సంవత్సరాలు పార్టీకోసం ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.

Also Read.. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవు..అసత్య ప్రచారలను నమ్మొద్దు

కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు వ్యవహారం త్వరలోనే హై కమాండ్ కు తెలుస్తుందన్నారు. ఎవరికి అయితే పార్టీ టికెట్స్ కట్టబెట్టిర్రో అందులో 20 శాతం మంది కాంగ్రెస్ పార్టీ మనుషులు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుందని ఆరోపించారు. పార్టీ కోసం ఎలాంటి ధర్నా లు, జెండా మోయని వాళ్ళు టికెట్స్ పొందారని తెలిపారు.  RSS, ABVP ల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News

More Articles