హైదరాబాద్: 1983 అక్టోబర్ 28న విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఖైదీ’కు నేటితో 40 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.8 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ మూవీలో చిరంజీవి నటన అప్పట్లో ఓ సంచలనం. ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీని గుర్తు చేసుకుంటూ.. ట్విట్టర్లో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ఈ మూవీ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసిందన్నారు. తన జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఖైదీ సినిమా అని అన్నారు. ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన టీమ్ ని అభినందించారు. చిరు పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని చేసింది.
నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది.
ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి
ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ,
ఆ చిత్ర… pic.twitter.com/raY4AOTAoH— Chiranjeevi Konidela (@KChiruTweets) October 28, 2023