హైదరాబాద్: బీజేపీ పార్టీకి మరోషాక్ తగిలింది. బాబూమోహన్ ఆ ఫార్టీ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబూమోహన్ మాట్లాడారు. తాను ఫోన్ చేస్తే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్టు చేయడం లేదని, కావాలనే తనను పార్టీకి దూరం పెట్టారని బాబూమోహన్ వాపోయారు.
Also Read.. ‘ఖైదీ’కి 40 ఏండ్లు.. చిరు ఎమోషనల్ పోస్ట్
‘‘ఈసారి ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న. ఎన్నికలు, పార్టీ ప్రచారాలకు దూరంగా ఉంటా. అధిష్ఠానం నిర్ణయం మేరకు పార్టీకి కూడా రాజీనామా చేస్తా. అసెంబ్లీ ఎన్నికల్లో నా కుమారుడికి టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం చేసి.. మా మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. పార్టీలో నాకు చాలా అవమానాలు జరిగాయి. ఆత్మాభిమానం దెబ్బతినడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా.’’ అని పేర్కొన్నారు.