కరీంనగర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసిఓర్వలేక ప్రతిపక్షాలకు కడుపు మంట కళ్ళు మండి విష ప్రచారం చేస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగల వంతెనను నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, చల్లా హరిశంకర్ తో కలిసి పరిశీలించారు.
Also Read.. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగం కాక తప్పదు.. హెచ్చరించిన హరీష్ రావు
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణకు తలమానికమైన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పై తలెత్తిన చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు, అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని, ప్రపంచంలోనే పెద్దపెద్ద ప్రాజెక్టులు నిర్మించిన టాటా సంస్థ ఈ నిర్మాణం చేపట్టిందన్నారు. పూర్తిస్థాయిలో నాణ్యతతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు.