Friday, May 3, 2024

తెలంగాణ డీఎస్సీ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు

spot_img

రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ  పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ అప్లికేషన్లకు నేటితో గడువు ముగియగా.. జూన్‌ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్‌ 20 రాత్రి 11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే, డీఎస్సీ పరీక్ష తేదీలనూ అధికారులు ఖరారు చేశారు.  జులై 17 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్‌లో 878 ఉండగా.. ఆ తర్వాత అత్యధికంగా నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనుంది విద్యాశాఖ.

ఇది కూడా చదవండి: తెలంగాణకు రేవంత్‌ రెడ్డి శాపంగా మారాడు

Latest News

More Articles