మణిపూర్లో తలెత్తిన శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అక్కడికి ప్రత్యేక విమానాన్ని పంపి తెలంగాణా విద్యార్థులను హైదరాబాద్కు తరలించేందుకు చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్తోపాటు హైదారాబాద్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంఫాల్ నుండి హైదరాబాద్కు తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణా ప్రజలు, విద్యార్థుల భద్రత కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులతో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.