Monday, May 6, 2024

పుట్టపాడులో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి

spot_img

ఛత్తీస్ గఢ్ సుకుమా జిల్లా పుట్టపాడు ( కిష్టారం పీఎస్) అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు చర్ల LOS దళ కమాండర్ మడకం ఎర్రయ్య @ రమేష్ గా గుర్తించామని, మరొక మావోయిస్టు ను గుర్తించాల్సి ఉందని చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధం, పేలుడు  పదార్థాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Latest News

More Articles