తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దాంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మరో మూడు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు.
కాగా.. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా జిల్లాల్లో అవసరమైన చోట్ల సెలవులు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.