Sunday, May 19, 2024

పేదలపై దౌర్జన్యం.. ఇదేనా ప్రజా పాలన..!

spot_img

రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో పేదల నిర్మాణాల కూల్చివేతలో రసాభాస జరిగింది. గగన్ పహాడ్ ఇంద్ర గాంధీ సొసైటీ లో 2వ రోజు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని షేడ్ నిర్మాణాలను తొలగించారు. ఉప కమిషన్ రవి కుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలని కూల్చి వేశారు. ఈ నిర్మాణాలు కూల్చి వేసే సమయంలో స్థానిక ప్రజలు అధికారులను అడ్డుకున్నారు. కచ్చితంగా అనుమతులు తీసుకుంటామని ఒక రెండు రోజులు కూల్చివేతలను ఆపాలని స్థానికులు అధికారులను కోరారు.

ఇక ఒకవైపేమో మేము పేదల పక్షపాతమని రేవంత్ ప్రభుత్వం అంటుంది. ఫుట్ పాత్ స్టాల్స్ ని అక్రమ నిర్మాణాలుగా చూడమని.. వాళ్ళని ఆదుకుంటామని మొన్న కుమారి ఆంటీ ఇష్యులో సీఎం రేవంత్ రెడీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన 24గంటల్లోనే దుర్గం చెరువు, రాజేంద్ర నగర్ లలో పేదల స్టాల్స్ ని అధికారులు కూల్చేశారు. దాంతో మీడియా ముందు సుప్పనాతి కబుర్లు చెప్తున్న రేవంత్ ఆచరణలో మాత్రం అవి చూపెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Latest News

More Articles