Sunday, May 19, 2024

మమ్మల్ని ముంచొద్దు.. ఆర్టీసీ డ్రైవర్ల ధర్నా..!

spot_img

హన్మకొండ హయగ్రీవ చారి కాంపౌండ్ లో అద్దె బస్సు డ్రైవర్ల ధర్నా నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల వేతనాలు పెంచాలంటూ విధులు బహిష్కరించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

పెరిగిన నిత్యావసర ధరలకు అనుకూలంగా 21 వేలకు వేతనాన్ని పెంచాలంటూ డిమాండ్ చేశారు. వరంగల్ 1, 2 డిపో, హన్మకొండ డిపో అద్దె బస్సుల డ్రైవర్లు ధర్నాలో పాల్గొన్నారు. వేతనాలను పెంచి అద్దె బస్సు డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా డిమాండ్ చేశారు.

Latest News

More Articles