Sunday, May 19, 2024

స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ సత్తా

spot_img

స్వచ్ఛ అవార్డులలో తెలంగాణ సత్తా చాటింది. స్వచ్ఛ భారత్ పట్టణ విభాగం లో చూసినట్తు అయితే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు అవార్డులు వచ్చాయి. ఇక ఈ అవార్డుల వివరాలను ఇప్పుడే చూసేద్దాము. స్వచ్ఛ భారత్ పట్టణ విభాగం లో తెలంగాణ కి మొత్తంగా నాలుగు అవార్డులు వచ్చాయి.

భారత స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇక దక్షిణ భారత దేశ విభాగం లో చూసినట్లయితే సిద్ది పేట, గండ్ల పోచం పల్లి, నిజాం పేట పట్టణాలు ఈ అవార్డులు ని సొంతం చేసుకోవడం జరిగింది.

వీటిని ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఈ నెల 11వ తేదీన ఇస్తారట. కేంద్రం నుండి ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఈ అవార్డులను అందించబోతోంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయితీ రాజ్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 10కి పైగా స్వచ్ఛ అవార్డులు అందుకుని దేశంలో సరికొత్త రికార్డులు సృష్టించాడు. అయితే అప్పటి అభివృద్ధి కార్యక్రమాలే నేటికీ అవార్డులు కొల్లగొడుతున్నాయని అంటున్నారు.

Latest News

More Articles