Saturday, May 18, 2024

రైతు బంధుపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన… నెలాఖరులోగా జమ..!!

spot_img

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నిజామాబాద్ లోని నందిపేటలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి..రైతు బంధుపై కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా రైతులందరికీ ఖాతాల్లో రైతు బంధు మొత్తాలను జమ చేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

2 ఎకరాలలోపు భూమి ఉన్న 29లక్షల మంది రైతుల ఖాతాలకు రైతు బంధు పథకం లబ్దిని బదిలీ చేశామన్నారు. మిగిలన రైతులకు డబ్బులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉంటుందని..రైతులకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చుతోందని చెప్పారు.

ఇక రైతులకు రుణమాఫీ అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంకితభావంతో ఉన్నారన్న మంత్రి తుమ్మల, వ్యవసాయరంగాన్ని ఆదుకునే విధానాలపై ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణలో నూతనంగా అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమ పథకాల విషయంలో చాలా కీలకంగా వ్యవహారిస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు..!!

Latest News

More Articles