Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ ధన్యా వాద సభను విజయ వంతం చేద్దాం

spot_img

దేశంలోనే ఎక్కడ లేనివిధంగా 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని నెలకొల్పడం మరియు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసినందుకు ప్రజాసంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కి అభినందన సభ నిర్వహించనుండగా ఈ సభకు సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ మంత్రుల నివాసంలో.. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ గజ్జల కాంతం, వివిధ కుల సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

హైదరాబాద్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించినందుకు, తెలంగాణ సచివాలయంకు బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టినందుకు .. అలాగే, తెలంగాణ అమరవీరుల స్మృతి వనం ను నిర్మించినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మే – 16న ‘ధన్యవాద సభ’ను నిర్వహిస్తున్న సందర్భంగా రూపొందించిన వాల్ పోస్టర్ ‘చలో ఇందిరా పార్క్’ ను ఆవిష్కరించారు.

Latest News

More Articles