Friday, May 17, 2024

పోలీస్‌ నుంచి గన్‌ లాక్కొని బెదిరించిన నిందితుడు

spot_img

ఒక పోలీస్‌ నుంచి గన్‌ను లాక్కొన్న నిందితుడు.. కాల్చుకుని చనిపోతానంటూ రచ్చ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మనీష్ ప్రజాపతి అనే వ్యక్తి రషీద్, డానిష్ లు దాడి చేసారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు డానిష్‌ను అరెస్ట్‌ చేశారు.

Also Read.. సంగారెడ్డి జిల్లాలో భూకంపం.. పరుగులు తీసిన జనం!

శనివారం మధ్యాహ్నం రషీద్‌ను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక పోలీస్‌ వద్ద ఉన్న గన్‌ను లాక్కున్నాడు. తొలుత పోలీసులను చంపెస్తానని బెదిరించాడు. ఆ తర్వాత తన కణతపై పెట్టుకొని తానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. తన ఫ్రెండ్ డానిష్ ను విడవాలని డిమాండ్‌ చేశాడు. రషీద్‌కు పోలీసులు నచ్చజెప్పి చివరకు అతడి నుంచి గన్‌ తీసుకున్నారు. రషీద్‌ను అరెస్ట చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

Latest News

More Articles