Friday, May 3, 2024

దారుణం..ముగ్గురు పిల్లలను చంపి తాను ఉరేసుకున్న తండ్రి.!

spot_img

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…మండలంలోని టంగుటూరుకు చెందిన రవి మనీ స్కీం పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లోని వారితో డబ్బులు కట్టించాడు. ఈ స్కీం ద్వారా రూ. వెయ్యికి రూ. 3వేలు, 58 రోజుల వ్యవధికి రూ లక్షకు రూ 5లక్షలు ఇప్పిస్తానంటా డబ్బులు కట్టించాడు.

తీరా డబ్బులు ఇవ్వకపోడంతో కట్టిన వారంతా అతడిని ఆడగడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కొక్కరుగా ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ముగ్గురు పిల్లలను చంపేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రధాని నరేంద్ర మోదీ హిందువు కాదు .!

 

Latest News

More Articles