Monday, May 20, 2024

శంషాబాద్‌లో గుప్తనిధుల కలకలం

spot_img

హైదరాబాద్‌ లోని శంషాబాద్‌లో గుప్తనిధుల ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం తొండపల్లి గ్రామ శివారులో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాదాపు 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపారు. అనంతరం అక్కడ కొబ్బరికాయలు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. తవ్వకాలు జరిగినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే చార్మినార్‌కి చెందిన అక్తర్‌ అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో తవ్వకాలు జరిపారు. లోపల పూజలు జరిపిన ఆనవాళ్లను గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మట్టి రంగు మారడంతో ఏమై ఉంటుందా అని తవ్వకాలు జరిపినట్టు అక్తర్‌ తెలిపాడు. ఈ తవ్వకాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు.

Latest News

More Articles