Friday, May 17, 2024

మల్లెపువ్వులా మజాకా ..కిలో ధర రూ. 1200..!!

spot_img

మాఘమాసం వచ్చింది..పెళ్లిల సీజన్ షురూ అయ్యింది. దీనికి తోడు మల్లెల గుబాళింపు కూడా మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా సాగుతుండటంతో మల్లె పువ్వులకు గిరాకీ బాగా పెరిగింది. సీజన్ లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో వారం రోజులుగా మల్లెల ధరలు భారీగా పెరిగాయి. మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెట్లో ఆదివారం కిలో మల్లెల ధర రూ. 1200పలికింది. అయితే రోజుకు సగటున 50కిలోల దిగుబడులు మించడం లేదని రైతులు అంటున్నారు. దాంతో సాధారణ దిగబుడల సమయంలో కిలో రూ. 200 లలోపే ధర ఉంటుండగా ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు అంటున్నారు. అయితే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో దిగుబడుల్లో ఆలస్యం, రైతులకు మరింత ఇబ్బందిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు తప్పిన పెను ప్రమాదం.!!

Latest News

More Articles