Friday, May 17, 2024

విషాదం..అన్న మరణ వార్త విని ఆగిన చెల్లెలి గుండె..!!

spot_img

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదం చోటుచేసుకున్నది. అన్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జరిగింది.

Also Read.. కాంగ్రెస్ లో ఐరన్ లెగ్ అన్నాచెల్లెళ్లు..!!

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామం నుంచి రంగుల పోశాలు(60) వలస వచ్చి కల్లూరు గ్రామంలో స్థిరపడ్డాడు. కూలీ పని చేసుకుంటూ జీవించే అతను కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ లోకి 40మంది లీడర్లు..!

నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో ఉన్న చెల్లెలు రంగు పోచవ్వ(52)కు అన్న మరణ వార్త తెలిసింది. దీంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే.. గుండెపోటుతో నేలకొరిగింది. అన్నాచెల్లెళ్ల మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోశాలుకు భార్య, కొడుకు, కుమార్తె ఉండగా..  పోచవ్వకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Latest News

More Articles