Saturday, May 4, 2024

సుప్రీంలో గద్వాల ఎమ్మెల్యేకు ఊరట..!!

spot_img

హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే ఇచ్చింది. ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Also Read.. భారీ వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి బ్రో…!!

రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని నోటీసుల్లో ఆదేశించింది. తన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించినట్లయింది. ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీకే అరుణ ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసారు.

Latest News

More Articles