హైదరాబాద్: అడవులను, వన్యప్రాణులను కాపాడుతూ తమ ప్రాణాలను త్యజించిన అటవీ అమరవీరులను స్మరించుకుందామని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో వారి నిబద్ధత పర్యావరణానికి వారు చేస్తున్న కృషి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం రోజున అటవీ సిబ్బందికి మన ప్రశంసలు అందజేద్దామని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా ఎంపీ సంతోష్ పిలుపునిచ్చారు.