Friday, May 17, 2024

యాదాద్రి ఆలయానికి ఒక్కరోజే రూ.కోటి ఆదాయం

spot_img

యాదాద్రి జిల్లాలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి ఇవాళ(ఆదివారం) భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో ఒక్కరోజే రూ. కోటి 9లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 5,20,800, కైంకర్యాల ద్వారా రూ. 2,500, సుప్రభాతం ద్వారా రూ. 23,700, బ్రేక్ దర్శనం వల్ల రూ. 10,85,400, వ్రతాల ద్వారా రూ. 12,46,400 ఆదాయం వచ్చిందని చెప్పారు.

అంతేకాదు..వాహన పూజల ద్వారా రూ. 24,400, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 23,85,000, ప్రచారశాఖ ద్వారా రూ.1,31,679, పాతగుట్టలో పూజల ద్వారా రూ. 3,29,200, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 8 లక్షలు వచ్చిందన్నారు ఆలయాధికారులు. యాదఋషి నిలయం ద్వారా రూ. 3,73,792, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 2,91,096, శివాలయం ద్వారా రూ. 16,500, పుష్కరిణీ ద్వారా రూ. 4,200, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 34,31,490 వచ్చిందని వివరించారు. శాశ్వత పూజలు ద్వారా రూ. 42,500, కల్యాణ కట్ట ద్వారా రూ. 1,91,900 , అన్నదానం ద్వారా రూ. 28,611, గది విరాళం ద్వారా రూ.11,700 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.

ఇది కూడా చదవండి: రాష్ట్రంలో కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

Latest News

More Articles