హైదరాబాద్: GHMC పరిధిలోని 15 సెగ్మెంట్లలో 312 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇవ్వాళ 15 నియోజకవర్గాల్లో కలిపి 20మంది అభ్యర్థులు ఉపసంహరణ చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా నాంపల్లి సెగ్మెంట్ బరిలో 34మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు.. ఉత్తర్వులు జారీ
ముషీరాబాద్ 31, మలక్ పేట్, యాకుత పురాలో 27మంది అభ్యర్థులు నిలవగా… ఖైరతాబాద్ 25, సికింద్రాబాద్ బరిలో 24 మంది అభ్యర్థులు రేసులో నిలిచారు. ఇక అత్యల్పంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బరిలో 10మంది అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.