Monday, May 6, 2024

దిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెద్ద ప్రమాదం

spot_img

ఇటావా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా వద్ద న్యూదిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్‌ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. పలు బోగీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read.. 60 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం

మొదటగా స్లీపర్‌ కోచ్‌లో పొగలు రావడాన్ని స్టేషన్‌ మాస్టర్‌ గమనించి అలెర్ట్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి తెలియగానే అనేకమంది ప్రయాణికులు భయంతో రైలు నుంచి కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  మొత్తం మూడు కోచ్‌లలో మంటలు చెలరేగినట్లు సీనియర్‌ ఎస్పీ సంజయ్‌ కుమార్‌ వర్మ వెల్లడించారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.

Latest News

More Articles