Sunday, May 19, 2024

రన్నింగ్ ట్రైన్‎లో దొంగతనం.. పట్టుకొని ట్రైన్ బయట కట్టేసిన ప్రయాణికులు

spot_img

ట్రైన్‎లో దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగను ప్రయాణికులు రైలుకు వేలాడదీశారు. ఈ ఘటన బీహార్‎లోని భగల్‎పుర్ జిల్లాలో జరిగింది. మంగళవారం జనవరి 16న ఓ మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణం చేస్తోంది. అయితే రైలులో ఉన్న ఓ యువకుడు ఆమె దగ్గరున్న స్మార్ట్ ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. కాసేటికి ఆ ఫోన్ లాక్కొని ట్రైన్ నుంచి దూకి పారిపోవాలని ప్రయత్నించాడు. గమనించిన తోటి ప్రయాణికులు.. అతడిని పట్టుకొని, ట్రైన్ విండోకు వేలాడదీశారు. అలా కొట్టుకుంటూ ఓ కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్లారు. అనంతరం రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే వచ్చి ఆ దొంగను పట్టుకొని స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను రైలులోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‎గా మారింది.

Read Also: చైనాలో మరో వైరస్‎పై ప్రయోగం.. అది సోకితే 8 రోజుల్లోనే మరణం

Latest News

More Articles