ట్రైన్లో దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిపోయిన ఓ దొంగను ప్రయాణికులు రైలుకు వేలాడదీశారు. ఈ ఘటన బీహార్లోని భగల్పుర్ జిల్లాలో జరిగింది. మంగళవారం జనవరి 16న ఓ మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణం చేస్తోంది. అయితే రైలులో ఉన్న ఓ యువకుడు ఆమె దగ్గరున్న స్మార్ట్ ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. కాసేటికి ఆ ఫోన్ లాక్కొని ట్రైన్ నుంచి దూకి పారిపోవాలని ప్రయత్నించాడు. గమనించిన తోటి ప్రయాణికులు.. అతడిని పట్టుకొని, ట్రైన్ విండోకు వేలాడదీశారు. అలా కొట్టుకుంటూ ఓ కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్లారు. అనంతరం రైలు ట్రాక్ మారుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వెంటనే వచ్చి ఆ దొంగను పట్టుకొని స్టేషన్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను రైలులోని ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది.
A thief who was seen trying to steal a passenger's phone from a moving train near Bhagalpur in Bihar was caught and dragged for a kilometer by passengers. pic.twitter.com/8N94JSUcND
— shinenewshyd (@shinenewshyd) January 17, 2024
Read Also: చైనాలో మరో వైరస్పై ప్రయోగం.. అది సోకితే 8 రోజుల్లోనే మరణం