కశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అనంత్నాగర్ జిల్లా కోకర్నాగర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో తీవ్రంగా గాయపడ్డ ఆర్మీ కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, జమ్మూ కశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి.. సోనియా, రాహుల్ లకు కవిత సవాల్.. సమాధానం చెప్పాకే తెలంగాణలో అడుగు పెట్టాలి..!!
ఈ మేరకు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో భద్రతా బలగాలు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు సైతం హతమయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.