Friday, May 3, 2024

బీహార్‌ దుర్గా పూజా వేడుక‌ తొక్కిస‌లాటలో ముగ్గురు మృతి

spot_img

ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో భాగంగా నిర్వ‌హించిన దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగి, ముగ్గురు చనిపోయారు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమ‌వారం రాత్రి జరిగింది.

గోపాల్ గంజ్ జిల్లాలోని రాజా దాల్ పూజా పండ‌ల్ దగ్గరకు  భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు భ‌క్తులు అధిక సంఖ్య‌లో త‌ర‌లిరావ‌డంతో, తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఓ చిన్నారి భ‌క్తుల మ‌ధ్య కింద‌ప‌డిపోయింది. ఆ చిన్నారిని కాపాడేందుకు య‌త్నించిన మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ముగ్గురిని చికిత్స నిమిత్తం స‌ద‌ర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తుండ‌గా.. దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో హ‌మూన్‌ తుపానుగా మారిన అల్ప‌పీడ‌నం

Latest News

More Articles