Sunday, May 19, 2024

ఛత్తీస్‌ఘడ్‌ ఎన్‌కౌంటర్‌లోముగ్గురు మావోయిస్టులు మృతి

spot_img

చ‌త్తీస్ ఘ‌డ్‌ కాంకేర్‌ జిల్లాలో పోలీసుల‌కు మావోయిస్టుల‌కు మ‌ధ్య ఇవా(ఆదివారం) జరిగిన ఎన్ కౌంటర్ లో  ముగ్గురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నక్సల్స్ సమావేశం అయ్యారని సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పులలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు పారిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎలెసేలా ప్రకటించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు  చెప్పిన ఎస్పీ.. ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు.

ఇది కూడా చదవండి: విషాదం..అమెరికాలో భారత జర్నలిస్టు దుర్మరణం.!

Latest News

More Articles