హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులు ముగ్గురిని సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 99కి చేరింది.
ప్రశ్నపత్రాల లీకేజీలో ఈ ముగ్గురు నిందితులు ప్రవీణ్కు సహకరించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు మూడోసారి తిరస్కరించింది.