Monday, May 20, 2024

స్కూల్ బస్ కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి

spot_img

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. ఓ మూడేండ్ల చిన్నారి స్కూల్ బస్ కిందపడి మృతిచెందాడు. హయత్ నగర్ కాండోర్ ష్రైన్ స్కూల్ బస్సు రోజూ వారి మాదిరిగానే విద్యార్థులను తీసుకురావడానికి కుంట్లూరు గ్రామానికి వెళ్లింది. అక్కడ డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకోవడానికి బస్సు ఆపాడు. ఆ సమయంలో పక్కనే ఆడుకుంటున్న మూడేండ్ల చిన్నారి పవన్ బస్సు వద్దకు వచ్చాడు. గమనించని డ్రైవర్.. బస్సును ముందుకు పోనియడంతో చిన్నారి మీదినుంచి వెళ్లింది. దాంతో చిన్నారి పవన్ అక్కడికక్కడే చనిపోయాడు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి చనిపోయాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని తీసేది లేదంటూ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు.

Read Also: ఓయూ విద్యార్థులు అడ్డమీది కూలీలు.. బీరు, బిర్యానీలు ఇస్తే ఇష్టమొచ్చినట్లు వాగుతారు

Latest News

More Articles