Thursday, May 9, 2024

ఓటీటీలోకి రెండు భారీ సినిమాలు.. వీకెండ్‎కు పండగే..

spot_img

చాలామంది థియేటర్ కు వెళ్లి సినిమా చూడలేక ఓటీటీలో వచ్చిన తర్వాత కుటుంబంతో కలిసి చూస్తుంటారు. అలాంటి వారందరికీ ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అవకాశమొచ్చింది. తాజాగా రెండు భారీ సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘జ‌వాన్‌’ మరియు టాలీవుడ్ స్టార్ రామ్ నటించిన ‘స్కంద’ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Read Also: స్కూల్ బస్ కిందపడి మూడేండ్ల చిన్నారి మృతి

బాలీవుడ్‌ స్టార్ షారుఖ్‌ఖాన్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా.. ఆయన నటించిన జవాన్‌ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. స్టార్ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌‎గా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్ప‌టివ‌ర‌కు రూ.1150 కోట్ల‌కు పైగా వసూళ్లతో టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుపుతూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో ఒక స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశారు.

అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా కూడా ఓటీటీలోకి వచ్చేసింది. మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్లడించారు.

Latest News

More Articles