Sunday, May 12, 2024

సీఎం కేసీఆర్ కాన్వాయ్‎ను తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బంది

spot_img

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకుల వాహనాలను కూడా చెక్ చేస్తున్నారు.

Read Also: ఓటీటీలోకి రెండు భారీ సినిమాలు.. వీకెండ్‎కు పండగే..

ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను తనిఖీచేసిన ఎన్నికల సిబ్బంది.. తాజాగా సీఎం కేసీఆర్ కాన్వాయ్‎ను కూడా తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‎ను అధికారులు పరిశీలించారు. ఇందల్వాయి చెక్ పోస్టు వద్ద సీఎం కాన్వాయ్ వాహనాలను బీఎస్ఎఫ్ సిబ్బంది ఆపారు. అనంతరం అన్ని వాహనాలను క్షుణ్ణంగా చెక్ చేశారు. సీఎం కాన్వాయ్ భద్రతా సిబ్బంది కూడా బీఎస్ఎఫ్ అధికారులకు పూర్తిగా సహకరించారు.

Latest News

More Articles