మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై ఆగ్రా హైవేపై ఆర్టీసీ బస్సును ట్రక్కకు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చందవాడ్ సమీపంలోని రాహుద్ ఘాట్ వద్ద మంగళవారం ఉదయం బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 8మంది ప్రయాణికులు స్పాడ్ డెడ్ అయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారికి ఆసుపత్రికి తరలించారు. మ్రుతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాహుద్ ఘాట్ లో నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతాలన్ని బ్లాక్ స్పాట్ గా అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ..రాహుల్ ఔట్..పంత్ఇన్.!