Friday, May 17, 2024

టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ..రాహుల్ ఔట్..పంత్ఇన్.!

spot_img

మరికొన్ని రోజుల్లో యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక టీ 20 ప్రపంచ కప్ కోసం ఆడనున్న టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.రోహిత్ శర్మ సారధ్యంలో జరగనున్న ఈ మెగా టోర్నీకోసం తాజాగా 11మంది ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్లేయర్ల పేర్లను తెలిపారు.

రోహిత్ శర్మ కెప్టెన్ గా ,వైఎస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఎంపికయ్యాడు. రిషభ్ పంత్, సంజు శాంసన్, యుజవేంద్ర చామల్, శుభమన్ గిల్ కూడా జట్టులో చోటు దక్కింది.అయితే కేఎల్ రాహుల్ కు మాత్రం చోటు దక్కలేదు.ఈసారి ప్రపంచకప్ యూఎస్, వెస్టిండిస్ వేదికగా జరగనున్నాయి. భారత్ తన తొలి మ్యాచును జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది.

ఈ మెగాటోర్నీ ప్రారంభ మ్యాచులో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడుతుంది. గ్రూప్ ఏలో ఉన్నభారత్ – పాక్ జట్టు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి.మొత్తంగా ఈ ప్రపంచకప్ సిరీస్ లో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి.అమెరికాలో 3, వెస్టిండీస్ లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచులు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచు జూన్ 29న నిర్వహించనున్నారు.

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్.

ఇది కూడా చదవండి:

Latest News

More Articles