కాంగ్రెస్ లో కొట్లాటలు షురూ అయ్యాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కోసం ముసలం పుట్టింది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ పెద్దలు తనకు హమీ ఇచ్చారని , కానీ ఇప్పుడు వేరే వాళ్లకు దానిని కట్టబెట్టారంటూ అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: చెవిలో ఈ శబ్దాలు వినిపిస్తున్నాయా?అయితే గుండెపోటు హెచ్చరికే..!!
పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా అమిర్ ఆలీఖాన్ కు పదవి ఎలా ఇస్తారంటూ ఫైర్ అయ్యారు. తాను పార్టీ కోసం గత 18ఏండ్లుగా కష్టపడి చేస్తున్నానని గుర్తుచేశారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని అజారుద్ధిన్ తెలిపారు.