Monday, May 13, 2024

ఒకేసారి వేలాది వాహనాలు.. జాతీయ రహదారిపై రద్దీ

spot_img

యాదాద్రి జిల్లా: సంక్రాంతి పండగకి సొంత గ్రామాలకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి హైదరాబాద్ వైపు ప్రయణమవుతున్నారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ వైపు వేలాది వాహనాలు ఒకేసారిగా వస్తుండడంతో  రహదారి మొత్తం రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

Also Read.. ప్రతిసారి నాకే అన్యాయం.. అద్దంకి తీవ్ర ఆవేదన..!

టోల్ ప్లాజాల వద్ద, చౌటుప్పల్ పట్టణలో.. అండర్ పాస్ వేలు లేని చోట, క్రాసింగ్ లు ఉన్న చోట   ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు, జీఎంఆర్ సిబ్బంది  ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి రహదారిపై వెళ్లే లోకల్ వాహనాలతో ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Latest News

More Articles